మీడియా పవర్, విశాఖపట్నం: విశాఖనగరం కేంద్రంగా జరుగుతున్న చిన్నారుల అక్రమ రవాణా వ్యవహారం ఆదివారం వెలుగులోకి వచ్చింది. యూనివర్సల్ సృష్టి హాస్పిటల్ ఎండీ నర్మత ఆధ్వర్యంలో చిన్నారుల అమ్మకాలు జరుగుతున్నట్టు పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. పిల్లలను పోషించలేని తల్లిదండ్రులకు ముందుగా కొంత నగదు ఇచ్చి పుట్టిన వెంటనే ఇతరులకు విక్రయిస్తున్న ముఠా గుట్టును ఛేదించారు. ఇద్దరు ఆశావర్కర్లు వెంకటలక్ష్మి, అన్నపూర్ణ, డాక్టర్ తిరుమల ఈ ముఠాకు సహకరిస్తున్నారని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఆర్ కె మీనా మీడియాకు తెలిపారు. ‘పిల్లల అక్రమ రవాణా కేసులో యూనివర్సల్ సృష్టి హాస్పిటల్ ఎండి నర్మత తో పాటు ఆరుగుర్ని అరెస్ట్ చేశామని తెలిపారు. విశాఖలోని జడ్పీ జంక్షన్ వద్ద గల యూనివర్సల్ సృష్టి హాస్పిటల్ కేంద్రంగా పిల్లల అక్రమ విక్రయాలు జరుగుతున్నాయన్న అయన ఈ ముఠా ఇప్పటివరకు ఆరుగురు చిన్నారులను కొనుగోలు చేసి అక్రమ రవాణా చేసినట్టు వెల్లడైందన్నారు. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు ’సీపీ పేర్కొన్నారు. గతంలోనూ సృష్టి హాస్పిటల్లో మోసాలు జరగడంతో పోలీసులు కేసు నమోదు చేయగా, యూనివర్సల్ సృష్టి హాస్పిటల్గా పేరు మార్చి చిన్నారుల అక్రమ రవాణాకు ఈ సంస్థ తెరతీసినట్టు తెలిపారు.
Post a Comment
0Comments
3/related/default