ఢిల్లీ : పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అంశంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిపే బెంచ్లో మార్పు చోటుచేసుకుంది. తొలుత జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు ధర్మాసనం జాబితాలో ఉన్న ఈ పిటిషన్ తాజాగా జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ రిషికేశ్ రాయ్ బెంచ్కు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ మార్చింది. ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం విదితమే ఉద్యోగ సంఘాలు కూడా వేరే పిటిషన్ దాఖలు చేశాయి. ఇది ఇలావుండగా రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఇప్పటికే కేవియట్ దాఖలు చేసింది. పంచాయతీ ఎన్నికలపై దాఖలైన పిటిషన్ విచారణలో తమ వాదనలూ పరిగణనలోకి తీసుకోవాలని కేవియట్లో ఎస్ఈసీ కోరింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై జస్టిస్ సంజయ్ కిషన్కౌల్ నేతృత్వంలోని ధర్మాసనానికి రేపు ఉదయం 11 గంటల తర్వాత విచారణకు వచ్చే అవకాశముంది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ను ఎస్ఈసీ విడుదల చేసిన నేపథ్యంలో రేపు సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు జారీచేస్తుంది అన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ బెంచ్లో మార్పు ...
January 24, 2021
0
Tags