మీడియా పవర్, 14 జనవరి 2021 : భారతదేశం యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని కోరుకునే ఏ "సూపర్ పవర్" కైనా భారత సైనికులు తగిన సమాధానం ఇవ్వగలరని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గురువారం పరోక్షంగా చైనాకు కఠినమైన సందేశం ఇచ్చారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేడు కర్ణాటకలో పర్యటించారు. అనుభవజ్ఞుల దినోత్సవారంలో పాల్గొన్న రక్షణ మంత్రి మాట్లాడుతూ, మన సైనికులు ప్రదర్శిస్తున్న శౌర్య పరాక్రమాలు అపూర్వమని కొనియాడారు. భారతదేశం గౌరవం పెంపొందించడంలో సైనికులు చేస్తున్న సాహసం, త్యాగాలు మరపు రానివని కొనియాడారు. 'అనుభవజ్ఞుల దినోత్సవం' సందర్భంగా ప్రసంగించిన ఆయన దేశానికి సైనికులు చేసిన సేవలు మరియు వారి కుటుంబ సభ్యుల త్యాగాలను గుర్తుచేస్తుదన్నారు. ఈ సమయంలో, దేశంలో రక్షణ రంగాన్ని పెంచడానికి 83 తేజస్ విమానాలను తయారు చేయాలని ప్రభుత్వం హెచ్ఐఎల్ను ఆదేశించిందని ఆయన తెలిపారు. ఈ నిర్ణయంతో దేశంలో సుమారు 50,000 కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించుకొనే వీలుకలిగిందని అన్నారు. మాజీ సైనికుల దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ, దేశంలోని మాజీ సైనికుల కోసం ఏదైనా చేయాలనేది ప్రభుత్వ ఆలోచన అన్నారు. అందుకే మీ కుటుంబ సభ్యుల గౌరవం మరియు సంరక్షణలో సాధ్యమైనంతవరకు మంచి చేయడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రయత్నిస్తోందని తెలిపారు. ఇప్పటికే కేంద్రం బుధవారం క్లియర్ చేసిన, 48,000 కోట్ల రక్షణ ఒప్పందం గురించి మాట్లాడిన రాజనాథ్ సింగ్, ఈ నిర్ణయం దేశంలో 50,000 మందికి పైగా ఉద్యోగావకాశాలను సృష్టించడానికి దోహదపడుతుందని అన్నారు.వన్ ర్యాంక్ వన్ పెన్షన్
ప్రధాని మోడీ తన మొదటి పదవీకాలంలో భారత సైన్యం మరియు సైనికుల కోసం వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పథకాన్ని అమలు చేశారని రాజనాథ్ సింగ్ అన్నారు. సిడిఎస్ ఏర్పాటును గతేడాది లాల్ ఖిలా నుంచి ప్రకటించారని గుర్తుచేశారు. ఈ నిర్ణయం భద్రతా దళాల మధ్య సమన్వయాన్ని పెంచిందని అన్నారు. మాజీ సైనికులలో బాధ్యతల భారాన్ని తగ్గించగలగడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని అన్నారు. మన ప్రభుత్వ కాలంలో పిల్లల విద్య, వివాహ గ్రాంట్లు, మెడికల్ గ్రాంట్లు ఇవ్వడంతో పాటు మరింత సంక్షేమం కల్పించేందుకు కృషిచేస్తున్నట్టు తెలిపారు.