రాయదుర్గంలోని నాలెడ్జ్‌ సిటీలో మరో ఐటీ సెజ్‌

MEDIA POWER
0

హైదరాబాద్‌: తెలంగాణలో మరో ఐటీ, దాని అనుబంధ కార్యకలాపాల ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.  హైదరాబాద్‌ రాయదుర్గంలోని నాలెడ్జ్‌ సిటీలో రూ. 823 కోట్లతో 3.6 ఎకరాల్లో సస్టెయిన్‌ ప్రాపర్టీస్‌ అనే సంస్థ సెజ్‌ ఏర్పాటు కోసం  కేంద్ర వాణిజ్య, పరిశ్రమల అనుమతుల మండలి (బోర్డ్‌ ఆఫ్‌ అప్రూవల్‌) ఆమోదం పొందింది.  2,13,125 చదరపు మీటర్ల నిర్మాణ స్థలంలో సెజ్‌ కార్యకలాపాలు ప్రారంభిస్తామని, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సుమారు 17,500 మందికి ఉపాధి కల్పిస్తామని సంస్థ దరఖాస్తు చేసుకుంది.  దీనికి సెజ్‌ హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేయగా ఇటీవల ఢిల్లీలో జరిగిన బీవోఏ సమావేశంలో అనుమతులు లభించాయి. ఈ సెజ్‌ నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాతే రాయితీలు వర్తిస్తాయని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 22 ఐటీ, దాని అనుబంధ సెజ్‌లు కార్యకలాపాలను నిర్వహిస్తుండగా  మరో 19 సెజ్‌లకు కేంద్రం అనుమతులు ఇచ్చినా అవి కార్యకలాపాలు నిర్వహించలేకపోతున్నాయి.  దీనితో వీటి  అనుమతులు రద్దయ్యాయి. తాజాగా సస్టెయిన్‌ ప్రాపర్టీస్‌ ఐటీ సెజ్‌ కోసం దరఖాస్తు చేసుకోగా కేంద్రం అన్ని కోణాల్లో క్షుణ్ణంగా పరిశీలించిన మీదట  రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం తీసుకొని అనుమతి ఇచ్చింది.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">