ప్రజల ప్రాణాలంటే విలువేలేదా ?

MEDIA POWER
0

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ  రసవత్తరంగా మారింది.   ఎన్నికల నిర్వహణ ఎస్‌ఈసీ  వర్సెస్ జగన్ ప్రభుత్వం అన్నట్టుగా తయారైంది.   మొత్తానికి ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్‌టాపిక్‌గా   మారిపోయింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్‌పై వైసీపీ  ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. 'జీహెచ్‌ఎంసీ  ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టి కూడా కరోనా భయానికి తండ్రీ కొడుకులిద్దరూ ప్రచారానికి వెళ్లలేదు. పంచాయతీ ఎన్నికల్లో మీ కంటే పెద్దవాళ్లు క్యూలో నిల్చుని ఓట్లు వేయాలని నిమ్మగడ్డతో చెప్పిస్తున్నారే. ప్రజల ప్రాణాలంటే  విలువే లేదా?' అంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. 

'రాజకీయ అవసాన దశలో సభ్యత, సంస్కారపు వస్త్రాల్ని విడిచి పారేసి చంద్రబాబు ‘నగ్నంగా’ చెలరేగిపోతున్నాడు . కళ్లు, చెవులు మూసుకొని అయ్యో అనడం మినహా చేయగలిగేది ఏమీ లేదు. ప్రజలైతే ఎప్పుడో తుపుక్కుమని ఊమ్మేసి బాబును పట్టించుకోవడం మానేశారు. రాబోయే రోజుల్లో ఇంకెన్ని వికృత చేష్టలు చూపిస్తాడో!' అంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. 


'రాజకీయ అవసాన దశలో సభ్యత, సంస్కారపు వస్త్రాల్ని విడిచి పారేసి ‘నగ్నంగా’ చెలరేగిపోతున్నాడు చంద్రబాబు. కళ్లు, చెవులు మూసుకొని అయ్యో అనడం మినహా చేయగలిగేది ఏమీ లేదు. ప్రజలైతే ఎప్పుడో తుపుక్కుమని ఊమ్మేసి బాబును పట్టించుకోవడం మానేశారు. రాబోయే రోజుల్లో ఇంకెన్ని వికృత చేష్టలు చూపిస్తాడో!' అంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. 
'రాజకీయ అవసాన దశలో సభ్యత, సంస్కారపు వస్త్రాల్ని విడిచి పారేసి ‘నగ్నంగా’ చెలరేగిపోతున్నాడు చంద్రబాబు. కళ్లు, చెవులు మూసుకొని అయ్యో అనడం మినహా చేయగలిగేది ఏమీ లేదు. ప్రజలైతే ఎప్పుడో తుపుక్కుమని ఊమ్మేసి బాబును పట్టించుకోవడం మానేశారు. రాబోయే రోజుల్లో ఇంకెన్ని వికృత చేష్టలు చూపిస్తాడో!' అంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">