విశాఖపట్నం : మహా విశాఖ నగరపాలక సంస్థకు చెందిన విశాఖ మ్యూజియాన్ని అన్ని
విధాలుగా అభివృద్ధి చేస్తామని కమిషనర్ సృజన తెలిపారు. కొవిడ్-19తో మూతపడ్డ మ్యూజియాన్ని ఆమె శనివారం తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా చరిత్ర
తెలిపేలా మరిన్ని నమూనాలను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. అభివృద్ధి ప్రతిపాదనలు సిద్ధం చేసి ఇవ్వాలని క్యూరేటర్ బంటు
సన్యాసినాయుడుని ఆదేశించారు. పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో నిర్మాణాలు
చేపట్టడానికి అవకాశాలు పరిశీలించాలన్నారు. సందర్శకులు భౌతికదూరం పాటించేలా
చూడడంతో పాటు, ప్రతి ఒక్కరికీ థర్మల్ స్క్రీనింగ్ చేయాలని, మాస్కు
లేకపోతే లోపలకు అనుమతి నిరాకరించాలని సూచించారు.