బూత్ కమిటీ, వార్డు కమిటీల సమావేశంలో పాల్గొన్న కె అనిల్ కుమార్ రాజు
February 04, 2021
0
విశాఖ ఉత్తరం: 14వార్డు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి కె అనిల్ కుమార్ ఆధ్వర్యంలో బూత్ కమిటీ సభ్యులు, వార్డు కమిటి సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని స్థానిక బాలయ్య శాస్త్రి లే అవుట్ లో గల శెట్టి బలిజి భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కె అనిల్ కుమార్ రాజు మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న నాటి నుండి ప్రజాసంక్షేమమే ద్యేయంగా అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వాటిని చేయడంలో తనకంటూ ప్రత్యేకతను సంతరించుకున్నారని అన్నారు. కాకుండా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచి ప్రజలు మన్ననలు చురగొంటున్నారని అభివర్ణించారు. రాబోవు జీవీఎంసీ ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతీ ఒక్కరూ కృషి చేసి జీవీఎంసీ మేయర్ పదవిని మన ముఖ్యమంత్రి గారి అభీష్టం మేరకు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో చొక్కాకుల రామకృష్ణ, టీఎస్ఎన్ మూర్తి, కోడూరు సత్యనారాయణ, బల్ల శ్రీనివాస్, అప్పన్న,స్టీల్ ప్లాంట్ నాయుడు, కె.సుశీల, భాష, స్వరూప్, తదితరులు పాల్గొన్నారు.