ఎమ్మెల్యే కోటంరెడ్డి భద్రత కుదించిన అధికారులు

MEDIA POWER
0

భద్రత  2+2 నుంచి 1+1కి కుదింపు 

నెల్లూరు : నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి భద్రతను అధికారులు కుదించారని తెలుస్తోంది.  ఇది వరకు వున్న భద్రతా సిబ్బంది  2+2 కాగా ఎప్పుడు అది  1+1కి తగ్గిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన పత్రంపై కోటంరెడ్డి సంతకం చేశాశని తెలుస్తోంది . ఇటీవల వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి కూడా పోలీసులు భద్రతను తగ్గించిన విషయం మరువక ముందే , కోటంరెడ్డి భద్రతను తగ్గించడం గమనార్హం. వీరిద్దరూ పార్టీ వీడేందుకు సిద్ధమైన నేపథ్యంలోనే భద్రత కుదించినట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి. 

గత కొంతకాలంగా సొంత పార్టీలో సరైన గౌరవం దక్కడం లేదన్న కారణంతో పార్టీ నుంచి దూరంగా ఉండేందుకు  కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నిర్ణయించుకున్నారు. అయితే, పార్టీకి చెందిన 13 మంది మంత్రులు, సలహాదారులు, ప్రాంతీయ కో-ఆర్డినేటర్లు తన వ్యక్తిత్వాన్ని అనుమానించే రీతిలో మాట్లాడటం జీర్ణించుకోలేక తప్పని పరిస్థితుల్లో మాట్లాడాల్సి వస్తోందని రెండు రోజుల క్రితం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తెలిపారు.  అంతే కాకుండా వైకాపా నేతలు తన ఫోన్‌ను ట్యాప్‌ చేస్తున్నారని ఆరోపించిన కోటంరెడ్డి దీనికి సంబంధించిన ఆధారాలను కూడా బయటపెడతానని అన్నారు.  ఏది ఇలా వున్న  క్రమంలోనే సీఎం జగన్‌,  సజ్జల రామకృష్ణారెడ్డి, తదితర పార్టీ పెద్దల జోలికొస్తే నడివీధిలో ఈడ్చుకుంటూ వెళ్తానంటూ కడపకు చెందిన బోరుగడ్డ అనిల్‌ అనే వ్యక్తి కోటంరెడ్డిని బెదిరించడం ప్రస్తుతం  చర్చనీయాంశమైంది. ఈ తరుణంలో ఆయన భద్రతను కూడా పోలీసులు కుదించడం వెనుక రహస్యం ఏమిటన్నది ప్రస్నార్ధకమే అంటూ పలురకాల చర్చలు జరుగుతున్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">