విశాఖపట్నం, ఏప్రిల్ 21: ఈ నెల 23వ తేదిన జరగబోవు చందనోత్సవంలో సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా దర్శన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున తెలిపారు. శుక్రవారం సాయంత్రం సింహచలం కొండపై ఉన్న ఆనందనిలయంలో చందనోత్సవ ఏర్పాట్ల పై పత్రికా విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చందనోత్సవం సందర్భంగా 23వ తేది తెల్లవారుజామున 3 గంటల నుంచి 3.30 మద్య ఆలయ ధర్మకర్త మరియు వారి కుటుంబ సభ్యులతో పాటు దేవాదాయశాఖ మంత్రివర్యులు స్వామివారిని దర్శించుకుని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడం జరుగుతుందన్నారు. అనంతరం 3.30 నుండి 4.30 మధ్య సమయంలో వివిఐపి దర్శనాలు, దేవస్థాన ట్రస్టు సభ్యులు స్వామి వారిని దర్శించుకుంటారని తెలిపారు. అనంతరం రూ 300/-లు, రూ 1000/-మరియు రూ1500/- టిక్కెట్ల దర్శన భక్తులకు అనుమతి ఉంటుందని టికెట్టు పై వారికీ కేటాయించిన సమయానికి వచ్చినట్టయితే రద్దీ సమస్యను అధిగమించే అవకాశం ఉంటుందని సూచించారు. తెల్లవారుజామున 4.00 గంటల నుండి రాత్రి 11.00 గంటల వరకు ఉచిత దర్శనంతో పాటు రూ.300/- మరియు రూ.1000/- దర్శనం టైమింగ్స్ తో కూడిన టిక్కెట్ల పై భక్తులు దర్శనం చేసుకునే అవకాశం దేవస్థానం కల్పించిందని తెలిపారు. అదే విధంగా వివిఐపి లు స్లాట్ 1 ఉదయం 5.00 గంటల నుండి 7.00 గంటల మధ్య , స్లాట్ 2 ఉదయం 8.00 గంటల నుండి 10.00 మధ్య దర్శన ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. మీడియాకి ఉదయం 5.00 నుంచి 7.00 గంటల మధ్య దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి 20 మీటర్లకు ఒక వాటర్ పాయింట్ ను దేవస్థానం మరియు జి.వి.ఎం .సి ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. అలాగే ముందురోజు రాత్రి వచ్చిన భక్తులకోసం స్థానపు గదులను, మరుగుదొడ్ల ఏర్పాటు, దేవాలయ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచే విధంగా పనులను జివియంసి చేపట్టిందన్నారు. భక్తులు రద్దీగా వుండే ప్రదేశాలను ప్రదేశాలను గుర్తించి అవసరమైన చోట మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నామన్నామని తెలిపారు. నడక మార్గంలో కూడా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరం విద్యుత్తు ఉండేలా అవసరమైన చర్యలు విద్యుత్తు శాఖ చేపట్టిందని కలెక్టర్ తెలిపారు.
పోలీసు కమిషనర్ డాక్టర్ సి.ఎం. త్రివిక్రమ్ వర్మ మాట్లాడుతూ భక్తులు అధికంగా ఉండే రద్దీ ప్రాంతాలను ముందుగా గుర్తించడం జరిగిందని, అటువంటి చోట్ల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే దర్శనానికి వచ్చే భక్తులు కొండ దిగువన వాహనాలకు ఏర్పాటు చేసిన పార్కింగ్ లోనే నిలిపి ట్రాఫిక్ సమస్యలకు తావులేకుండా చూడాలని సూచించారు. కొండపైన కామన్ కామాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసామని భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. కుటుంబసభ్యులు ఎవరైనా తప్పిపోయిన యెడల ఈ సెంటర్ నుండి ప్రకటిస్తారని తెలిపారు.
ఈ సమావేశంలో సింహాచల ఇఒ త్రినాదరావు, చీఫ్డి ఫెస్టివల్ అధికారి ఆజాద్, డి.సి.పిలు ఆనందరెడ్డి, వి.నాగన్న, విద్యాసాగర్ నాయుడు, సంబంధిత శాఖల అదికారులు పాల్గొన్నారు.