మీడియా పవర్, విశాఖపట్నం: మూడున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన "విజెఎఫ్" పరువు బజారుకీడ్చే ప్రయత్నంలో సీనియర్ జర్నలిస్టులమని చెప్పుకునే కొంత మంది వారి పరువు వారే తీసుకొంటున్న వైనం అత్యంత బాధాకరమని విజేఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు వాపోయారు. సోమవారం ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొంతమంది సభ్యులు తొలుత 12 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, తర్వాత 20 లక్షల రూపాయలు అవినీతి జరిగిందని, తర్వాత గంట్ల శీను బాబుకి ప్రెస్ క్లబ్ కొంత నగదు అప్పు ఉందని ఇలా పలు రకాలుగా వాట్సప్ గ్రూపులలో విష ప్రచారాలు చేస్తూ వారిపరువు వారు తీసుకోవడమే కాకుండా తోటి జర్నలిస్టుల పరువు బజారుకీడుస్తున్నారని మండిపడ్డారు. అధికారులను కలిసి తప్పుడు ఫిర్యాదులు చేస్తూ ప్రెస్ క్లబ్ పరువునుతీసే ప్రయత్నం సరికాదని హితవు పలికారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన త్రిసభ్య కమిటీకి అన్ని ఆధారాలను సమర్పించామన్నారు. కమిటీ నివేదిక కోసం ఎదురుచూస్తున్న సమయంలో కొంతమంది కావాలని పనిగట్టుకుని లేనిపోని ఆరోపణలు గుప్పిస్తూ వాట్సప్ గ్రూపులలో పోస్టులు పెడుతున్నారన్నారు. నివేదిక వచ్చేవరకు తాము సంయమనం పాటించాలని భావించామని, ప్రెస్ క్లబ్ పై అవగాహన లేని కొందరు వ్యక్తులు చేస్తున్న ఆరోపణలపై తాము గట్టిగా స్పందిస్తే పరిస్థితి వేరుగా ఉంటుందని హెచ్చరించారు. ఆరోపణలు చేస్తున్న కొంతమంది వ్యక్తుల అసలు స్వరూపాలు ఎవరికీ తెలియదు అనుకోవడం పిల్లి కళ్ళుమూసుకుని పాలుతాగడమే అవుతుందని ఎద్దేవాచేశారు. ప్రతి ఒక్కరికి సంబంధించిన బాగోతాలపై తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. తాము ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నామని, వారిలా ఎదురుదాడికి ప్రయత్నించడం లేదని, సంయమనం పాటిస్తున్నామని తెలిపారు. కాలం చెల్లిన కార్యవర్గం అంటూ వ్యాఖ్యలు చేయడం స్థానిక పత్రికల మనుగడను ముంచిన నాయకులు సంస్కారంతో ఆలోచించుకోవాలని హితవుపలికారు. విజేఎఫ్ చరిత్రను చూసుకుంటే కొత్త కమిటీ ఏర్పడే వరకు పాత కమిటీ బాధ్యతలు నిర్వహిస్తుందని, గెలిచిన వారికి బాధ్యతలు అప్పగిస్తుందని తెలిపారు. 35 ఏళ్లుగా ఇదేవిధంగా ఎన్నికలు జరిగాయని, అవగాహన లేకుండా కాలం చెల్లిన కార్యవర్గం అని చేస్తున్న ఆరోపణలు చేయడం వారి విజ్ఞతకు వదిలేస్తున్నామని శ్రీనుబాబు తెలిపారు. 2018లో చివరి కోర్టు కేసు పై తీర్పు ఆధారంగా ఎన్నికలకు వెళ్లాలని సిద్ధమవుతున్న తరుణంలో కోవిడ్ మహమ్మారి కారణంగా మూడేళ్లు ఎన్నికలకు ఆటంకం ఏర్పడిందన్నారు. కోర్టు ఆదేశాలమేరకు జిల్లా కలెక్టర్ సూచనలతో, ప్రెస్ క్లబ్ బైలా ప్రకారం ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో విజేఎఫ్ పై ఎటువంటి అవగాహన లేని ప్రస్తుతం జర్నలిజం తో సంభంద భందాయాలు లేని కొంతమంది కావాలని అమాయకులను కొంతమంది మిత్రులను రెచ్చగొట్టి ఎన్నికలను ఆపేందుకు ప్రెస్ క్లబ్ పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నిజంగా ఎన్నికలు జరగాలనుకుంటే ప్రెస్ క్లబ్ కమిటీకి సహకరించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు. ప్రతిరోజు మీడియా వాట్సప్ గ్రూపులలో ప్రెస్ క్లబ్ పై చెడు ప్రచారాలు చేయడమే పనిగా పెట్టుకున్న దొరబాబుల ముసుగులో ఉన్న నాయకులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాము బాధ్యతలు చేపట్టిన సమయంలో ప్రెస్ క్లబ్ ను ముప్పై ఐదు వేల రూపాయాలతో నటి కార్యవర్గం అప్పగించారని గుర్తుచేశారు. 12 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందని అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని శ్రీనుబాబు దుయ్యబట్టారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జరగకుండా ఆపేందుకు వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించలేదని, సుమారు 700 పైగా సభ్యత్వ నమోదు జరిగిందన్నారు. మెజార్టీ సభ్యుల మద్దతు ప్రస్తుత ప్రెస్ క్లబ్ కమిటీకి ఉందనే విషయం అవగతమవుతుందన్నారు. ఎంత రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినా మీడియా గ్రూపులలో తప్పుడు మెసేజ్ లు పెట్టినప్పటికీ తాము సంయమనం పాటిస్తున్నామని త్రిసభ్య కమిటీ నివేదిక కోసమే తాము ఎదురుచూస్తున్నామని చెప్పారు. నివేదిక వచ్చిన అనంతరం నిబంధనల మేర ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని, కొత్తగా ఎన్నికైన సభ్యులను ఆహ్వానించి వారికి ప్రెస్ క్లబ్ బాధ్యతలను అప్పగిస్తామని శ్రీనుబాబు తెలిపారు. ఈ సమావేశంలో విజెఎఫ్ కార్యదర్శి దాడి రవికుమార్, ఉపాధ్యక్షుడు నాగరాజు పట్నాయక్,కోశాధికారి పిఎన్ మూర్తి, సభ్యులు మాధవ్, ఈరోతి ఈశ్వరరావు, గిరిబాబు పాల్గొన్నారు.
విష ప్రచారాలు చేస్తూ.... తప్పుడు ఫిర్యాదులు ఇస్తూ వారిపరువు వారే తీసుకొంటున్న వైనం అత్యంత బాధాకరం ... విజేఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు
May 08, 2023
0
Tags