మీడియా పవర్, విశాఖపట్నం: జాతీయ నేత్రదాన అవగాహన వారోత్సవాన్ని పురస్కరించుకుని పభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రితో కలిసి సీఐఐ యంగ్ ఇండియన్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొని నేత్రదాన ప్రక్రియను సరళమైన మార్పులతో ఎలా సులభతరం చేయవచ్చో వివరించారు. సీఐఐ యంగ్ ఇండియన్స్ నుంచి డాక్టర్ త్రిప్తి యెరమిల్లి, రాయ్ కొడాలి పాల్గొని విద్యార్థుల సృజనాత్మకతకను మెచ్చుకున్నారు. నేత్రదానం ప్రాముఖ్యతను, నేత్ర దానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులు అద్భుతంగా ,విపులంగా వివరించారు.